Skip to content Skip to footer

ఓ ఆంధ్రుడా మేలుకో !!! నీ జాతి నవ్వులపాలు కాకుండా అడ్డుకో !!!

అర్ధరాత్రి లభించిన స్వాతంత్ర్యం నుండి అమృతోత్సవాలు జరుపుకుంటున్న నేటికి, రాజకీయాల్లో నైతికత ఎవరెస్టు శిఖరం నుండి అధః పాతాళంలోకి జారిపోయింది. అతివలను గౌరవించలేని జాతికి అమృతోత్సవాలు దేనికి అని ఇతరులు మనల్ని ప్రశ్నిస్తే తలదించుకోవాలని తెలుసుకో !!! రాష్ట్రంలో గత రెండేళ్ళగా మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలను మనం ఎన్నుకున్న నాయకులు ఆపాల్సింది పోయి, వాళ్ళ ప్రవర్తన వీటిని ప్రోత్సహించే విధంగా ఉంది. దీనికి తోడు ప్రభుత్వం కూడా ఇటువంటి నాయకుల మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరం.
శాసన సభ వేదికగా తల్లి లాంటి వ్యక్తి మానహననానికి పాల్పడ్డ కలియుగ దుశ్శాసనులను, అతివలను వేధిస్తూ నెట్టింట నగ్న ప్రదర్శనలిచ్చే కలియుగ కీచకులను,క్యాసినోలను నడిపే కంత్రీలను చట్ట సభలకు పంపిన ఆంధ్రుడా…

మహిళలు ఇటువంటి సంఘటనల మీద తిరుగుబాటు చేసి విధ్వంస ధోరణికి చేరకముందే, మహిళల రక్షణకై ఒక బాధ్యతగల పౌరునిగా మన రాబోయే తరాల భవిష్యత్తు కోసం ఖచ్చితంగా స్పందించడం మన అందరి బాధ్యత!!!

రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా గౌ. లోక్ సభ స్పీకర్, లోక్ సభ ఎథిక్స్ కమిటీ మరియు జాతీయ మహిళా కమిషన్ కి లేఖలు (ఇమెయిల్) పంపడంలో దయచేసి మాతో చేరండి.

ధన్యవాదాలు🙏